
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) నిర్వహించే AP ICET-2026 (Andhra Pradesh Integrated Common Entrance Test) కు సంబంధించి అభ్యర్థులకు ముఖ్య గమనిక. 2026-27 విద్యా సంవత్సరానికి గాను MBA మరియు MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 23, 2026 వరకు పొడిగించారు.మార్చి 23 తర్వాత దరఖాస్తు చేసుకునే వారు నిర్ణీత ఆలస్య రుసుముతో (రూ. 1,000 నుండి రూ. 10,000 వరకు) ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.మే 2, 2026 న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతుంది.అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు వివరాలు:
OC అభ్యర్థులకు: రూ. 750/-
BC అభ్యర్థులకు: రూ. 700/-
SC/ST అభ్యర్థులకు: రూ. 650/-
అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. కన్వీనర్, AP ICET-2026