రేగుపాలెంలో పల్లె పండుగ-2” ద్వారా మంజూరైన సిమెంట్ రోడ్డు..

రేగుపాలెంలో పల్లె పండుగ-2” ద్వారా మంజూరైన సిమెంట్ రోడ్డు..

10/March/2026 07:23    Share:   

రేగుపాలెంలో పల్లె పండుగ-2 కార్యక్రమం
యలమంచిలి:నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యలమంచిలి మండలం,రేగుపాలెం గ్రామపంచాయతీ శివారు మల్లవరం గ్రామంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్రాంట్ నిధులతో “పల్లె పండుగ-2” ద్వారా మంజూరైన సిమెంట్ రోడ్డు పనికి మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేష గిరి రావు (శేషు) శంకుస్థాపన చేశారు. రొంగళి రాము ఇంటి నుండి రాజాన కొండ ఇంటి వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అంచనా విలువ రూ. 8.50 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈకార్యక్రమంలో కొక్కిరాపల్లి పిఏసిఎస్ చైర్మన్ గోపి, తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసి నాయుడు, లాలం సోమునాయుడు, మాజీ జడ్పీటీసీ రాజాన నారాయణమ్మ, అనపర్తి రాజు, మహాలక్ష్మి నాయుడు, మాజీ సర్పంచ్ కొల్లి సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter