అన్నదాత సుఖీభవతో రైతు జీవితాల్లో వెలుగులు: ప్రగడ నాగేశ్వరరావు

అన్నదాత సుఖీభవతో రైతు జీవితాల్లో వెలుగులు: ప్రగడ నాగేశ్వరరావు

17/March/2026 11:52    Share:   

మునగపాక (ఎలమంచిలి నియోజకవర్గం): దేశానికి వెన్నెముకైన రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో నిర్వహించిన "అన్నదాత - రైతన్న మీకోసం" వారోత్సవాల ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రైతు సంక్షేమమే ధ్యేయం: రైతు సంక్షేమాన్ని విస్మరించిన ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలవలేదని, గత వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం: ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' నిధులను విడతల వారీగా అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో సుమారు ₹6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు.
మూడవ విడత నిధులు: ప్రస్తుత మూడవ విడతలో పీఎం కిసాన్ నిధులతో కలిపి ప్రతి రైతు ఖాతాలో ₹6,000 జమ చేయడం జరిగిందని, ఇది సాగుకు పెట్టుబడి సాయంగా ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుకు భరోసా: రైతులకు సాగుకు అవసరమైన అన్ని వసతులు మరియు అవకాశాలను కల్పిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయి కృష్ణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు,జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు,ఉల్లింగల గోవింద,కాండ్రేగుల శంకర్,బొడ్డెడ వెంకట రమణ, సూరిశెట్టి రాము, మల్ల నర్సింగరావు, పేతకంశెట్టి రాజు నాయుడు, దాడి శ్రీనివాసరావు, నాయుడు, దాడి శివ, సూరిశెట్టి అప్పలనాయుడు, మల్ల శేషు,దొడ్డి బుజ్జి, దొడ్డి సాంబశివ,భేసెట్టి నాగేశ్వరరావు,ఆడారి లక్ష్మణరావు మరియు ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter