గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు సాగిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ మీడియాతో తెలిపారు. నిందితులు కర్రీ సత్యనారాయణ, దొడ్డి రామర నాగేశ్వరరావు, గౌతు శేషు ,బంగారు దుర్గాప్రసాద్, చందాని పృధ్వి రాజుల వద్ద నుండి 300 నగదు గంజాయి సేవించేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏలూరు టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ ఎస్ఐ రామకృష్ణ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు