యలమంచిలిలో స్వచ్ఛంద చలివేంద్రాలతో దాతల సేవా స్పూర్తి,మానవత్వానికి నిదర్శనం..!

యలమంచిలిలో స్వచ్ఛంద చలివేంద్రాలతో దాతల సేవా స్పూర్తి,మానవత్వానికి నిదర్శనం..!

29/May/2026 21:23    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

భగ్గుమంటున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ యలమంచిలి పట్టణంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. మండే ఎండల్లో ప్రయాణికులు, పాదచారులు, కార్మికులు, వాహనదారుల దాహాన్ని తీర్చేందుకు చల్లటి మంచినీరు, మజ్జిగ అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు.పట్టణంలోని మెయిన్ రోడ్డులో స్వాతి సాయి ఎలక్ట్రానిక్స్ వర్క్స్ ఓనర్ శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకు విశేష ఉపశమనం కలిగిస్తోంది. అలాగే తులసి చలివేంద్రం, తాపీ మేస్త్రి వర్కర్స్ చలివేంద్రం, చూచుకొండ మారేశ్ తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ఎండలతో అలసిపోయిన వారికి చల్లని ఊరటనిస్తున్నాయి. ప్రతిరోజూ వందలాది మంది ఈ చలివేంద్రాల వద్ద దాహార్తిని తీర్చుకుంటూ దాతల సేవాస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ప్రజలు వడగాల్పులకు గురికాకుండా గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి చల్లటి వాతావరణం కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కేవలం మంచినీరు అందించడమే కాకుండా, ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.“మనిషికి నీరు అందించడం మహాదానం” అనే భావంతో ముందుకొచ్చిన ఈ దాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనుషులకే కాకుండా నోరులేని జీవాలు, పక్షుల దాహం తీర్చేందుకు కూడా చెట్ల వద్ద నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. చెట్ల నీడలో నీటి డ్రమ్ములు, పాత్రలు ఉంచితే పక్షులు, జంతువులు ప్రాణాలు నిలుపుకుంటాయని తెలిపారు.ఎండలు మరింత తీవ్రరూపం దాలుస్తున్న ఈ సమయంలో మరిన్ని సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter