ఎలమంచిలి ట్రాఫిక్ నిబంధనలపై పండ్ల వ్యాపారులకు అవగాహన సదస్సు..
20/May/2026 07:47
Share:
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్త్రాంద్ర జోనల్ ఇంచార్జ్ : ఎలమంచిలి రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మంగళవారం స్థానిక పండ్ల వ్యాపారులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. పండ్ల బండ్లు, దుకాణాల వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన పరిమితుల్లోనే వ్యాపారాలు నిర్వహించాలని అధికారులు సూచించారు.వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపై కాకుండా క్రమబద్ధంగా పార్కింగ్ చేసేలా వ్యాపారులు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే కాలినడకన వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్లను ఖాళీగా ఉంచాలని కోరారు.రోడ్లపై పండ్ల వ్యర్థాలు వేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశమున్నందున పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రజా భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలకు సహకరించాలని అధికారులు వ్యాపారులను కోరారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, పండ్ల వ్యాపారులు పాల్గొన్నారు.