సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారం: ఏపీ అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ

సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారం: ఏపీ అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ

09/May/2026 07:18    Share:   

అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో కొనసాగిన గ్రీవెన్స్ సెల్..అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ
శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.
స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి విశేష కృషి జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ హాజరై, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు.
ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సదుపాయాలు మరియు సామాజిక భవనాల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనపై స్థానికులు ఆయనకు అర్జీలు సమర్పించారు. ఆయా వినతులను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి, జాప్యం లేకుండా సమస్యలను తక్షణం పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియను చేపడతామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్రతో పాటు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter