రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో యలమంచిలి క్రీడాకారులకు రెండు బంగారు పతకాలు
08/May/2026 18:59
Share:
Reporter కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ యలమంచిలి రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో యలమంచిలి క్రీడాకారులు రెండు బంగారు పతకాలు సాధించారని టైక్వాండో కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈనెల 5.వ తేదీ నుంచి 7.వ తేదీ వరకు విజయనగరం లో రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐదవ ఏపీ కప్ రాష్ట్రస్థాయి ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో సత్య టైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ సీనియర్ క్రీడాకారులు ఒక స్వర్ణ పథకం , రజిత పథకాన్ని సాధించారని తెలిపారు. సీనియర్ మెన్ 80 కిలోల భాగంలో కొండల రవి బంగారు పతకం సాధించగా, 68 కిలోల భాగంలో సేనాపతి నాగేశ్వరరావుకు రజిత పథకం లభించింది అన్నారు. విజేతలను యలమంచిలి టైక్వాండో క్లబ్ అధ్యక్షులు కె. జగదీష్ పాల్, అంతర్జాతీయ క్రీడాకారుడు కె.దొరబాబు, సంఘం సభ్యులు క్రీడాకారులు అభినందించారని తెలిపారు.