కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర భారీ పెరుగుదల: ఢిల్లీలో రూ. 3,071.50కి చేరిన రేటు..

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర భారీ పెరుగుదల: ఢిల్లీలో రూ. 3,071.50కి చేరిన రేటు..

02/May/2026 10:16    Share:   

న్యూ ఢిల్లీ: సామాన్యులపై ధరల భారం మరోసారి పెరిగింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరను భారీగా పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 993 పెంచడంతో, దేశ రాజధాని ఢిల్లీలో దీని ధర రూ. 3,071.50కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, దిగుమతి వ్యయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పెంపు ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలపై తీవ్రంగా పడనుంది, తద్వారా బయట ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Breaking News

Subscribe our Newsletter