చెరుకుపల్లి గ్రామ సచివాలయం భవనం సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు..!!

చెరుకుపల్లి గ్రామ సచివాలయం భవనం సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు..!!

13/May/2026 17:09    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్

విజయనగరంజిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం సొంత భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతున్న నేపథ్యంలో,ఈ సమస్యపై కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సిసిఆర్) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ప్రజా ఫిర్యాదు అందజేశారు.దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్న సిసిఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల పన్నుల డబ్బులతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఉపయోగంలోకి రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు తెలియజేసినా సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.గ్రామ సచివాలయం సొంత భవనంలోకి వెంటనే కార్యాలయాన్ని మార్చాలని, దీంతో సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగుతాయని సిసిఆర్ ఎన్‌జీఓ డిమాండ్ చేసింది.
జిల్లా కలెక్టర్ వినతిపత్రాన్ని స్వీకరించి, సంబంధిత శాఖ అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిసిఆర్ సభ్యులు కర్రోతు రాము, యడ్ల సూర్యనారాయణ, టివియస్ ప్రకాష్ తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter