మూలజంప గ్రామంలో తాగునీటి సమస్యపై అధికారుల దృష్టి – అక్రమ కనెక్షన్లపై చర్యకు ఆదేశాలు

మూలజంప గ్రామంలో తాగునీటి సమస్యపై అధికారుల దృష్టి – అక్రమ కనెక్షన్లపై చర్యకు ఆదేశాలు

17/April/2026 15:19    Share:   

రాంబిల్లి, మండలంలోని మూలజంప గ్రామంలో గొల్ల వీధి, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు అధికారులు స్పందించారు. రాంబిల్లి ఎంపీడీవో జయామధురి గారి ఆదేశాల మేరకు గ్రామ సెక్రటరీ దొరబాబు, సచివాలయ ఈఏ నవీన్ లు మంగళవారం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.పరిశీలనలో భాగంగా, కొందరు గ్రామస్థులు బోరు నుంచి నేరుగా ట్యాంకుకు వెళ్తున్న సప్లై లైన్‌కు ఇంటి కుళాయిలు బిగించుకోవడం, అలాగే డిస్ట్రిబ్యూషన్ లైన్‌కు కనెక్షన్లు తీసుకోకపోవడం వల్ల మిగతా ప్రజలకు నీరు అందడం లేదని గుర్తించారు.ఈ అక్రమ కనెక్షన్లను తీసుకున్న వారిని గుర్తించి, వారికి రెండు రోజులలోపు తమ కుళాయిలను తొలగించి, డిస్ట్రిబ్యూషన్ లైన్‌కు అనుసంధానించుకోవాలని సూచించారు. స్వచ్ఛందంగా తొలగించని పక్షంలో వాటిని గుర్తించి, నోటీసులు జారీచేసి పంచాయతీ సిబ్బందే తొలగిస్తారని సెక్రటరీ, ఈఏ హెచ్చరించారు.ప్రస్తుతం మంచినీరు అందని వారికి తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ, రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో మంచినీళ్లు సరఫరా చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జ్ అందుకూరి ప్రసాద్, మాజీ సర్పంచ్ వేగ రాము పాల్గొన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Breaking News

Subscribe our Newsletter