
యలమంచిలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గొర్ల శివన్నారాయణమూర్తి అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 27, 28, 29 తేదీలలో నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు విజయవంతం కావడానికి పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరిశ్రమలను తీసుకువస్తున్నారని, వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి మున్సిపాలిటీలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
పట్టణ సమావేశంలో ముఖ్యమైన తీర్మానాలను కేంద్ర కార్యాలయానికి పంపించనున్నట్లు తెలిపారు. పార్టీ పటిష్టత, విస్తరణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని, కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొటారు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ ఇంచార్జిలు బోద్ధపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, మాజీ కౌన్సిలర్ మజి రామకృష్ణ, ఉపాధ్యక్షులు దంట్ల వెంకటస్వామి, తెలుగు అధ్యక్షులు నమ్మి రమణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లి బాబురావు, వార్డు అధ్యక్షులు కరెడ్ల మల్లికార్జునరావు, దుప్పట్ల శంకర్, శ్రీమంతుల శ్రీనివాసరావు, బొద్దపు నాగేశ్వరరావు, బీసెట్టి చిన్నారావు, యల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.