మే 18 నుండి ఘనంగా తెలుగుదేశం

మే 18 నుండి ఘనంగా తెలుగుదేశం 'మహానాడు' వేడుకలు: పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.

11/May/2026 21:13    Share:   

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 'మహానాడు' కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మహానాడు నిర్వహణకు సంబంధించి కీలక షెడ్యూల్‌ను ప్రకటించారు. అన్ని పార్లమెంటు మరియు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహానాడు షెడ్యూల్ వివరాలు:మే 18, 19, 20 తేదీలలో: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'నియోజకవర్గ మహానాడు' కార్యక్రమాలు నిర్వహించబడతాయి.మే 23, 24 తేదీలలో: అన్ని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో 'పార్లమెంట్ మహానాడు' కార్యక్రమాలు జరుగుతాయి.
నియోజకవర్గ స్థాయి మహానాడులో ఆమోదించిన తీర్మానాలను మే 21వ తేదీ లోపు, అలాగే పార్లమెంట్ స్థాయి మహానాడు తీర్మానాలను మే 24వ తేదీ నాటికి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశించారు.
ఈ మహానాడు కార్యక్రమాలకు పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,సానుభూతిపరులు మరియు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి,కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Breaking News

Subscribe our Newsletter