కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలి.సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్ 

 కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలి.సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్ 

11/May/2026 18:23    Share:   

జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి.కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్ 

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు :
 
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో,జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని 
సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు విమర్శించారు.
సోమవారం ఏలూరు, పవర్ పేట లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తామని మాటలు చెప్పడం కాదని ఆచరణలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. కొల్లేరు కాంటూరు ఐదు నుండి మూడు కి కుదిస్తేనే కొల్లేరు ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాజెక్టు పనులు ఇస్తున్న ప్రాధాన్యత సర్వం కోల్పోతున్న నిర్వాసిత గిరిజనులు, గిరిజన పేదలు, ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవడంలేదని అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలన్నారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలు పరిష్కరించాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వలన అయినకాడికి దళారులకు అమ్ముకుని రైతాంగం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2400 అమలు జరిగేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు వెంటనే కల్పించాలని, ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మామిడి,ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారం చేసి ఆదుకోవాలన్నారు. ఏలూరు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం చేయాలని, వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలని సిపిఎం జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో తీర్మానాలు చేసినట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. శ్రీనివాస్, నగర కార్యదర్శి పంపన రవికుమార్ పాల్గొన్నారు.
సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిగా ఆర్.లింగరాజు ఎన్నిక..సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శిగా ఆర్.లింగ రాజు ఎన్నికయ్యారు.ఇప్పటికి వరకు జిల్లా కార్యదర్శిగా పని చేసిన ఎ.రవి కుటుంబం మరియు వ్యక్తిగత కారణాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేయడం కోసం తనను ఏలూరు జిల్లా నుండి రిలీవ్ చేయమని కోరారని అయన కోరిక మేరకు జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర నాయకులు సమక్షంలో చర్చించి ఆయనను రిలీవ్ చేయడం జరిగిందన్నారు.జిల్లా కమిటీ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ ఆమోదించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో నూతన కార్యదర్శి ఎన్నిక జరిగిందని ఆర్.లింగరాజు ప్రకటించారు. జిల్లాలోని ప్రజా సమస్యలపై జూన్, జూలై మాసాల్లో ఆందోళనలు చేపడుతున్నామని వెల్లడించారు.
Breaking News

Subscribe our Newsletter