
విశాఖపట్నం, ఏప్రిల్ : సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ఈనెల 20వ తేదీన (20-04-2026) వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేక వాహన పార్కింగ్, ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీ చేసింది.
వెహికల్ పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే న్యూ టోల్ గేట్ ద్వారా కొండపైకి అనుమతి.
పాస్ లేని వాహనాలు నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి, దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత/ప్రత్యేక బస్సులలో కొండపైకి వెళ్లాలి.
హనుమంతువాక/సిటీ వైపు నుంచి: కృష్ణాపురం న్యూ గోశాల వద్ద పార్కింగ్ → ప్రత్యేక బస్సు.
గోపాలపట్నం/వేపగుంట/అనకాపల్లి వైపు నుంచి: శ్రీనివాస కళ్యాణ మండపం పరిసరాలు (మినర్వా స్కూల్ గ్రౌండ్, శ్రీనివాస్ నగర్ రోడ్లు) → ప్రత్యేక బస్సు.
సొంత్యం/విజయనగరం వైపు: అడవివరం జంక్షన్ లోని వెంకటాద్రి నగర్ పార్కింగ్ → బస్సు.
హనుమంతువాక వైపు: కార్లు – అడవివరం జంక్షన్ ఓపెన్ గ్రౌండ్, ద్విచక్ర వాహనాలు – BC వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్.
గోపాలపట్నం వైపు: కార్లు – పంతులుగారి తోట, ఆటోలు/ద్విచక్రాలు – మేకతోట పార్కింగ్ → ఓల్డ్ గోశాల నుండి బస్సు.
పెందుర్తి/వేపగుంట/సబ్బవరం వైపు: సింహపురి కాలనీలోని APSRTC స్థలం/సాయి నగర్ పార్కింగ్ → సింహపురి కాలనీ బస్ స్టాప్ నుండి బస్సు.
భారీ వాహనాలు: ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల నుండి ఏప్రిల్ 21 ఉదయం 5 గంటల వరకు సొంత్యం-అడవివరం మార్గంలో ప్రవేశం లేదు. వాటిని సత్తరవు జంక్షన్ లేదా ఆనందపురం మీదుగా మళ్లించాలి.
ఆటోలు: గోపాలపట్నం నుండి వచ్చే ఆటోలు సింహాచలం వైపు రాకుండా, మేకతోట పార్కింగ్ వద్ద భక్తులను దించి అక్కడే పార్క్ చేయాలి.
నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పార్క్ చేయాలి (SNR ఫంక్షన్ హాల్ వెనుక, HP పెట్రోల్ బంక్ పక్కన, దేవస్థానం గ్యారేజీ).
కొండ దిగువన ఉన్న టాక్సీ స్టాండ్ నుండి కేటాయించిన RTC బస్సులలో మాత్రమే కొండపైకి చేరుకోవాలి.
సింహాచలం పరిసర ప్రాంతాల వాసులు అత్యవసరమైతే తప్ప ఏప్రిల్ 20న ఓల్డ్ గోశాల నుండి అడవివరం వరకు వాహనాల్లో ప్రయాణించవద్దు.
అవసరమైతే ఆధార్ కార్డు చూపించి పోలీసులకు సహకరించాలి.
గమనిక: భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ, గూగుల్ కో-ఆర్డినేట్స్, సూచిక బోర్డుల సహాయంతో పార్కింగ్ ప్రాంతాలను చేరుకోవాలి. అధికారులు సహకారం కోరుతున్నారు.