నక్కపల్లి టీడీపీలోకి 60 మంది వైఎస్సార్‌సీపీ నేతలు..

నక్కపల్లి టీడీపీలోకి 60 మంది వైఎస్సార్‌సీపీ నేతలు..

18/April/2026 19:42    Share:   

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18 ( క్రైo అనాలిసిస్ ప్రతినిధి ఆనంద్ ): నక్కపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 60 మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పార్టీ కండువాలు ధరించి అధికారికంగా చేరికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా టీడీపీ కృషి చేస్తున్నందునే ప్రజలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీ అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter