
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా యలమంచిలి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అగ్ని ప్రమాదాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి రాంబాబు సూచించారు.శుక్రవారం నాల్గవ రోజు యలమంచిలిలోని సెంటిమెరీ స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంపై అధికారి రాంబాబు వివరించారు.అలాగే, అడ్డురోడ్లోని ఆదర్శ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్లో కూడా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా బయటపడాలి, అగ్నిమాపక పరికరాలను ఎలా వినియోగించాలి వంటి అంశాలను ప్రాక్టికల్గా ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల సమయంలో భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ప్రాణాలను కాపాడుతుందని అధికారి రాంబాబు నొక్కిచెప్పారు.అగ్నిమాపక శాఖ మరింత మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు అగ్ని భద్రతా చర్యలపై అవగాహన పెంచుకోవాలని కోరుతున్నారు. ఎలాంటి అగ్ని ప్రమాద సంఘటనలోనైనా వెంటనే అగ్నిమాపక కేంద్రానికి (101) ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.