ఎలమంచిలి టౌన్లో దొంగల దాడి: 35 తులాల వెండి, పావు తులం బంగారం చోరీ..

ఎలమంచిలి టౌన్లో దొంగల దాడి: 35 తులాల వెండి, పావు తులం బంగారం చోరీ..

23/May/2026 21:55    Share:   

ఎలమంచిలి, మే 23, 2026 – ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త ఎర్రవరం గ్రామంలో దొంగలు దాడి చేసి సుమారు 35 తులాల వెండి ఆభరణాలు, పావు తులం బంగారు ఉంగరాన్ని అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఫిర్యాదుదారు దుబాసి శివకుమారి (34) తన భర్త హనుమంతరావుతో కలిసి కొత్త ఎర్రవరం గ్రామంలో నివాసం ఉంటున్నారు. మే 21, 2026న ఉదయం 9 గంటలకు ఆమె తన కుమారుడు, చెల్లెలి కుటుంబ సభ్యులతో కలిసి పి. ధర్మవరం గ్రామంలోని తన తల్లి ఇంటికి వెళ్లారు. మే 23, 2026న ఉదయం 5.15 గంటలకు తిరిగి వచ్చి చూడగా, ఇంటి ఉత్తర వైపు ప్రధాన ద్వారం పగులగొట్టబడి ఉంది.దొంగలు ఇంటిలోకి ప్రవేశించి ఐదు జతల వెండి పట్టీలు (సుమారు 35 తులాలు), ఒక బంగారు లక్ష్మీదేవి ఉంగరం (సుమారు పావు తులం) చోరీ చేసినట్లు ఆమె గుర్తించారు. ఫిర్యాదు మేరకు ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందించిన వారికి బహుమతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ ( క్రైమ్ అనాల్సిస్ ప్రతినిది )

Breaking News

Subscribe our Newsletter