అనకాపల్లి జిల్లాలో ఈవీఎంల భద్రతపై అధికారుల సమీక్ష..

అనకాపల్లి జిల్లాలో ఈవీఎంల భద్రతపై అధికారుల సమీక్ష..

23/May/2026 08:01    Share:   

అనకాపల్లి జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఎన్నికల అనంతరం భద్రపరిచిన ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్ వద్ద అధికారులు భద్రతా పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్, సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది కలిసి స్ట్రాంగ్‌రూమ్ పరిసరాలను తనిఖీ చేసి భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా అన్ని ప్రక్రియలు నిర్వహిస్తున్నామని, ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం మరింత పెరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు భద్రతా సిబ్బంది 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు.

క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ఏ.
Breaking News

Subscribe our Newsletter