ఎల్ నినో దృష్టిలో పెట్టుకొని పంటలకు భీమా PMFBY తప్పనిసరి !
22/July/2026 19:50
Share:
ఎలమంచిలి మండల CSC సెంటర్ లో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ ఎల్ నినో సంత్సారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన మంత్రి పంటల బీమా యోజన (PMFBY)పై రైతులకు అవగాహనప్రధాన మంత్రి పంటల బీమా యోజన (PMFBY)పై రైతులకు అవగా దెబ్బతిన్నప్పుడు రైతులకు బీమా పరిహారం అందించబడుతుంది. రైతులు తక్కువ ప్రీమియంతో 84 వరి పంటకు మరియు తమ పంటలను బీమా చేయించుకునే అవకాశం ఉంది.ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంటల బీమా నమోదు ప్రక్రియ కొనసాగుతున్నందున, అర్హత కలిగిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం (RSK), గ్రామ/వార్డు సచివాలయం, లేదా సంబంధిత బ్యాంకులను సంప్రదించి బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.బీమా నమోదు కోసం రైతులు కింది పత్రాలను సమర్పించవలెను:ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ భూ హక్కు పత్రాలు / పంట సాగు ధృవీకరణ మొబైల్ నంబర్ పంట నష్టం జరిగిన సందర్భంలో రైతులు నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, తద్వారా నష్ట అంచనా ప్రక్రియ వేగవంతంగా పూర్తై పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పంటలను బీమా చేయించుకొని ఆర్థిక భద్రతను పొందాలని వ్యవసాయ శాఖ వారు తెలియజేశారు,ఏమైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయ అధికారినీ 8331056391సంప్రదించాలి అని తెలియజేశారు.