విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ గత 20 రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు సమస్యను పరిష్కరించకుండా ఢిల్లీ పోలీసులు నిరాహార దీక్షను భగ్నం చేయడం దుర్మార్గం అని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, అభ్యుదయ వాదులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కార్మికులు, విద్యార్థులు అచ్యుతాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము ,మండల కన్వీనర్ కే సోము నాయుడు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పేపర్ లీక్ విషయంలో విద్యార్థులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని వీరి కుటుంబాలకి న్యాయం చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు సరి కదా సమస్యను జటిలం చేస్తున్నది శాంతియుత ఆమరణ దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం సమస్యను పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు మేరుగు రాజేష్, కడారి ఉమాశంకర్, చుక్క ప్రభాకర్ విద్యార్థులు ఎస్ బుజ్జి, యు హారిక, వి రేష్మ, జి కావ్య, జె శ్రావ్య, ఆర్ కార్తీక్, ఎల్ రాజేష్ పాల్గొన్నారు.