- బాధిత ఖాతాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా భరోసా
- బీఓబీ గోల్డ్ లోన్ వ్యవహారం: రీ-అప్రైజల్ ప్రారంభం
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, జూన్,
జంగారెడ్డిగూడెం బ్యాంకు అఫ్ బరోడా బ్రాంచ్ లో గోల్డ్ లోన్ వ్యవహారంపై విజయవాడ ప్రాంతీయ మేనేజర్ ఎస్.కె.కిరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి బాధిత ఖాతాదారుడికి, ప్రభావితమైన వారందరికీ వారి సంతృప్తి మేరకు పరిష్కారం అందించడానికి బ్యాంకు పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.రెగ్యులేటరీ మార్గదర్శకాలకు అనుగుణంగా మరియు వారికి అర్హమైన సంరక్షణతో ప్రతి ఫిర్యాదు కూడా పరిష్కరించబడుతుందన్నారు.బ్యాంక్ ఆఫ్ బరోడా తన వినియోగదారులందరికీ వారి నమ్మకం మరియు ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యతని, విజయవాడ రీజియన్లోని జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో నిర్వహించిన సాధారణ అంతర్గత నివారణా తనిఖీ (ప్రివెంటివ్ విజిలెన్స్ ఆడిట్) సందర్భంగా, బంగారు రుణ ఖాతాలకు సంబంధించి ఒక ఉల్లంఘన గుర్తించబడిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే, బ్యాంక్ తన వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, బ్రాంచ్లోని అన్ని బంగారు రుణ ఖాతాలపై తక్షణమే మరియు సమగ్రంగా పునఃమూల్యాంకనం (రీ-అప్రైజల్) ప్రారంభించి, త్వరితగతిన చర్యలు చేపట్టిందన్నారు. పారదర్శకత పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధిత ప్రతి వినియోగదారుడి సమక్షంలోనే అన్ని బంగారు రుణ ప్యాకెట్ల ధృవీకరణను నిర్వహిస్తోందని, ఈ ప్రక్రియ జాగ్రత్తగా మరియు కచ్చితత్వంతో పూర్తయ్యేలా చూసేందుకు, అర్హత కలిగిన ఆభరణాల మదింపుదారులను (జ్యువెల్ అప్రైజర్స్) మరియు అదనపు సిబ్బందిని కూడా బ్రాంచ్లో నియమించడం జరిగిందన్నారు.
రెగ్యులేటరీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఫిర్యాదు కూడా పరిష్కరించబడుతుందని ప్రభావితమైన వారందరికీ వారి సంతృప్తి మేరకు పరిష్కారం అందించడానికి బ్యాంకు పూర్తిగా కట్టుబడి ఉందని కిరణ్ రెడ్డి చెప్పారు.