న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉజ్జ్వల పథకం కింద ఇచ్చే వార్షిక సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కోటాను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందుతున్న వార్షిక కోటాను కేవలం నాలుగు సిలిండర్లకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యులకు, ప్రభుత్వ తాజా నిర్ణయం మరింత భారంగా మారబోతోంది. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడంపై లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.