వన  సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించిన భూములపై హక్కు పత్రాలు పంపిణీ చేయాలి.....

వన  సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించిన భూములపై హక్కు పత్రాలు పంపిణీ చేయాలి.....

08/June/2026 20:23    Share:   

వన  సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించిన భూములపై హక్కు పత్రాలు పంపిణీ చేయాలి.విఎస్ ఎస్ సభ్యులకు గుర్తింపు కార్డు లు మంజూరు చేయాలి.
బి.కె.ఎం.యు., రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్....
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు:
జిల్లాలో వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించిన భూములపై వ్యక్తిగత హక్కు పత్రాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి.కె.యం.యు.)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనము నందు సిపిఐ, బి.కె.యం.యు.,ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితుల సమస్యలపై జిల్లా సదస్సు బి.కె.యం.యు.,జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆవుల శేఖర్ మాట్లాడుతూ వన సంరక్షణ సమితిలో 1996లో సిపిఐ,వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తదనంతర కాలంలో పాలకులు వన సంరక్షణ సమితులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా మిగులు భూములు ఉన్నాయని, ఇప్పటికే ప్రభుత్వ భూములలో పేద ప్రజలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల వద్ద బలవంతంగా భూములు లాక్కొని బడా పారిశ్రామికవేత్తలకు  కారు చౌకగా భూములు కట్టబెట్టి గ్రామీణ ప్రాంత పేదల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఉన్న వన సంరక్షణ సమితులతో పాటు సమీపంలో ఉన్న గ్రామీణ పేదలతో నూతనంగా వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేయాలని, వీరందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో ఇప్పటికే ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో విబిజి రాంజీ పథకాన్ని తీసుకొచ్చి జూలై 1వ తేదీ నుంచి అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నదని.దీనిని రద్దు చేసే వరకు ఉపాధి హామీ కూలీలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ, బికేఎంయు పూర్తిగా సంఘీభావం తెలిపి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు..తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని వన సంరక్షణ సమితుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ జిల్లాలో 200 పైబడి వన సంరక్షణ సమితులు ఉన్నాయని కేవలం 30 సమితులు మాత్రమే పనిచేస్తున్నాయని,అటవీ శాఖ అధికారులు తక్షణం జోక్యం చేసుకొని చేసుకుని అన్ని వన సంరక్షణ సమితిలు సక్రమంగా పని చేయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.వన సంరక్షణ సమితులు  అటవీ సంపదను కాపాడటంతో పాటు దీనిపై ఆధారపడిన గిరిజనులు గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధి మెరుగుపడటానికి తోడ్పడుతుందన్నారు.తక్షణం జిల్లాలో వన సంరక్షణ సమితులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.బి కే యంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం కారణంగా వన సంరక్షణ సమితిలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. కేవలం జామాయిల్ మొక్కలనే కాకుండా కాకుండా, ఫలసాయం వచ్చే మొక్కలను పంపిణీ చేయాలని కోరారు.కొన్నిచోట్ల అటవీ శాఖ అధికారులు రిజర్వుడ్ ఫారెస్ట్ అని వీఎస్ఎస్ సభ్యులను వేధిస్తున్నారని, తక్షణం వేధింపులు మాని,వి.ఎస్. ఎస్.సభ్యుల జీవనం మెరుగుపడే విధంగా వారికి యాజమాన్యపు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాల యేసు, జిల్లా ఉపాధ్యక్షులు మడిమి కామయ్య, జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి లక్ష్మీనారాయణ, తాడిగడప జయరాజు, ఫోటేలు పెంటయ్య, యడ్లపల్లి రమేష్  పలువురు వీఎస్ఎస్ సభ్యులు ప్రసంగించారు. ఈ జిల్లా సదస్సులో చింతలపూడి,టి.నరసాపురం, కామవరపుకోట మండలాలకు చెందిన వన సంరక్షణ సమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter