నిర్వాసితులకు న్యాయం చేయాలి,లేకపోతే భారీ ఉద్యమం తప్పదు: సీపీఎం హెచ్చరిక.!

నిర్వాసితులకు న్యాయం చేయాలి,లేకపోతే భారీ ఉద్యమం తప్పదు: సీపీఎం హెచ్చరిక.!

01/June/2026 08:27    Share:   

క్రైమ్ అనాల్సిస్ : టివియస్ ప్రకాష్ :

రాంబిల్లి మండలంలోని జెడ్ చింతువా, ఎం చింతువా రెవెన్యూ గ్రామాలతో పాటు రెన్యూ సోలార్, గూగుల్ డేటా సెంటర్ పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన నిర్వాసిత ప్రాంతాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, మండల కార్యదర్శి జి. దేవుడు నాయుడు, నాయకుడు వై. రాము బృందం పర్యటించి స్థానిక నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, సుమారు 400 ఎకరాల భూములను ఈ రెండు కంపెనీల కోసం సేకరించినప్పటికీ నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో భూ నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. వేలాది కొబ్బరి చెట్లు, జీడిమామిడి తోటలు, బోర్లు, నుయ్యిలకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.భూములు కోల్పోయిన ఆరు గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన పాలకులు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. పూర్తిస్థాయిలో నిర్వాసితులైన మత్స్యకారులు, సన్నకారు రైతులకు వెంటనే ఆర్ అండ్ ఆర్ (పునరావాస, పునరుద్ధరణ) ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.గ్రామాల చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ రహదారులు, స్మశాన వాటికలు, బహిర్భూమి స్థలాలు, పిల్లల ఆట మైదానాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల త్యాగాలతో ఏర్పడుతున్న పరిశ్రమల వల్ల స్థానికులకు ప్రయోజనాలు అందకపోవడం అభివృద్ధి కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నిర్వాసిత రైతులకు అన్ని విధాలా న్యాయం చేయాలని, లేకపోతే బాధితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చేపల గోవింద్‌తో పాటు నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter