అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడుల్లో మరో అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న పెదతీనార్ల వీఆర్వో చిట్టిబాబు, పొలం పాస్ పుస్తకం జారీ చేసేందుకు రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఫిర్యాదుదారుని నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిట్టిబాబును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. అవినీతి అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు