దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ బి ఎస్ ఎన్ ఎల్ రీసెర్చ్ ఇన్నోవేషన్
01/March/2026 19:48
Share:
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ లోని బేసిక్ సైన్సెస్ & హ్యూమానిటీస్ (బి ఎస్ & హెచ్) విభాగం ఆధ్వర్యంలో బి ఎస్ ఎన్ ఎల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యూబేషన్ సెంటర్ సహకారంతో 2026 ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించబడింది. సర్ సి.వి. రామన్ గారి “ రామాన్ ఎఫెక్ట్ “ ఆవిష్కరణను స్మరించుకుంటూ శాస్త్రీయ అవగాహన, ఆవిష్కరణ, పరిశోధనాసక్తి పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం 2026 థీమ్ “ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్” ను ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన డా. పి. పవిత్ర గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (బి ఎస్ & హెచ్) ఇంజినీరింగ్ రంగంలో శాస్త్ర విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బలమైన శాస్త్రీయ పునాది ఉన్నప్పుడే ఇంజినీర్లు సాంకేతిక ఆవిష్కరణలు చేయగలరని, సమాజ సమస్యలకు పరిష్కారాలు అందించగలరని తెలిపారు. ఆర్. వైకుంఠరావు గారు, ప్రిన్సిపాల్, ఈ సంవత్సరం థీమ్ను ప్రస్తావిస్తూ శాస్త్రీయ జ్ఞానం మరియు ఆవిష్కరణాత్మక ఆలోచనలతో యువతను శక్తివంతం చేయడం ద్వారా భారత్ ప్రపంచ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగంలో నాయకత్వం వహించగలదని తెలిపారు. అలాగే మన దైనందిన జీవితంలో శాస్త్రం ఎంత ముఖ్యమో ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. కమ్యూనికేషన్, రవాణా, వైద్యం, విద్యుత్ వినియోగం వంటి కార్యకలాపాల్లో శాస్త్ర సూత్రాలు ఎలా పనిచేస్తాయో వివరించి విద్యార్థులను శాస్త్రాన్ని సృజనాత్మకంగా వినియోగించమని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తి మరియు పరిశోధన దిశగా ప్రేరణ కలిగించేలా నిర్వహించబడింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆధునిక సాంకేతికతలపై ప్రాయోగిక అవగాహన పొందారు.