పి. బయ్యవరం ఎంపియుపియస్ పాఠశాలలో జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవం
01/March/2026 13:03
Share:
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని పి. బయ్యవరం ఎంపియుపియస్ పాఠశాలలో 28-02-26 న జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి. ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. క్రైమ్ అనాల్సిస్ (టివియస్ ప్రకాష్) యలమంచిలి : ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ శాస్త్రీయ అంశాలపై తమ ప్రతిభను చాటుతూ ఆకర్షణీయమైన ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, శక్తి సంరక్షణ, విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు వంటి అంశాలపై రూపొందించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. సత్యనారాయణ, కె. వీరభద్రరావు, కన్యకుమారి, గౌతమి పాల్గొని విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, విద్యార్థుల్లో విజ్ఞానాసక్తిని మరింతగా పెంచింది.