ఆరోగ్యకర వాతావరణానికి మెరుగైన బాటలు వేసేందుకు బృహత్ ప్రణాళికలతో ముందుకువెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే రానున్న వర్షాకాలంలో ఎన్నిదుక్కుల వర్షం కురిసినా ఎవరి ఇంటివద్దా చుక్క నీరు నిల్వకుండా శానిటేషన్ పనులను మెరుగ్గా, చురుగ్గా నిర్వహింపచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు దశలవారీగా పరిష్కారాలు చూపుతూ వస్తోన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,,, తాజాగా మరో బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. గత డిఆర్సి సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం శానిటేషన్ పనుల మెరుగునకు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో రోజుకొక డివిజన్ చొప్పున 50రోజులు పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక 19వ డివిజన్ హనుమాన్ నగర్, ఎన్టీఆర్ కాలనీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. ఆ పనులను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పర్యవేక్షించారు. ఈ శానిటేషన్ డ్రైవ్ మొత్తం మూడు భాగాలుగా అమలు చేస్తున్నారు. అందులో మొదటిది చిన్నచిన్న డ్రైన్లలో పూడిక తీయడం, రెండోదీ నివాసిత ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, తుప్పలను యంత్రాల సాయంతో తొలగించడం, మూడోదీ ఇళ్ళలోని సెప్టిక్ ట్యాంకులకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన డెలివరీ పైపులకు మస్కిటో నెట్లను అమర్చడం వంటి విధానాలను ఎంతో ప్రయోగాత్మకంగా చేపట్టారు. దీనిద్వారా రానున్న రాజుల్లో వర్షాలు అధికంగా కురిసినా నీరు నిలిచే అస్కారం లేకపోవడంతో పాటూ దోమలు పెరిగే అవకాశం లేదనే చెప్పాలి. ఈ పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజాహితమే ధ్యేయంగా చేపట్టే కార్యక్రమాలకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ప్రధానంగా ప్రతి డివిజన్లో డ్రైన్ల పూడిక తీత సమయంలో డ్రైన్లపై స్థానికులు ఏర్పాటు చేసుకున్న రాళ్ళను తొలగించాల్సి ఉంటుందన్నారు. అప్పుడే డ్రైన్ల పూడిక తీత సవ్యంగా సాగుతుందన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా అధికారులకు, సిబ్బందికి సహకరించాలని సూచించిన ఎమ్మెల్యే చంటి,,, దీంట్లో ఎవరైనా ఇబ్బందులెదుర్కొంటే నేరుగా తన కార్యాలయంలో సంప్రదించవచ్చునని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కమిషనర్ ఏ.భాను ప్రతాప్, కో- ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, ఎంహెచ్ఓ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు, క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, డివిజన్ ఇంచార్జ్ పైడి పార్వతి, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాండ్రంకి భాస్కరరావు, దావులూరి రాంబాబు, నక్క అప్పారావు, గండికోట గోవిందు బొడ్డేపల్లి నాగరాజు, దుర్గాసి లక్ష్మణరావు, సొంగ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు...