మునగపాకలో జరిగిన భారీ చోరీ. కేసును ఛేదించిన పోలీసులు 

మునగపాకలో జరిగిన భారీ చోరీ. కేసును ఛేదించిన పోలీసులు 

21/February/2026 07:52    Share:   

క్రైమ్ అనాలసిస్:A. Srinivasa Rao 
పాత నేరస్తుడు అరెస్ట్ రూ.30.39 లక్షల విలువైన 16.5 తులాల బంగారం స్వాధీనం: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్. 
అనకాపల్లి (మునగపాక), ఫిబ్రవరి 20, 2026: మునగపాక మండలంలో జరిగిన భారీ గృహ దొంగతనం కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు అత్యంత వేగంగా, కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఈరోజు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, రికవరీ చేసిన సొత్తును వెల్లడించారు. కేసు వివరాలు & దర్యాప్తు: ఫిబ్రవరి 15న శివరాత్రి పర్వదినం సందర్భంగా మునగపాక మండలం, గంతవానిపాలెంకు చెందిన శ్రీమతి కరణం ఉమావతి గారు తన ఇంటికి తాళం వేసి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలోని 17.5 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మునగపాక పోలీసులు (Cr.No: 55/2026) కేసు నమోదు చేశారు. పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి, ఫిబ్రవరి 19 రాత్రి కొక్కిరపల్లి జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు & నేర చరిత్ర: అరెస్ట్ అయిన నిందితుడు కోన రాజేష్ (23), అనకాపల్లి టౌన్ నివాసి. ఇతను పాత నేరస్తుడు (Repeat Offender) అని విచారణలో తేలింది. ఇతనిపై గతంలోనూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు గృహ దొంగతనం కేసులు నమోదయ్యాయి: Cr. No.154/2025 (HB Night) Cr. No.141/2025 (HB Night)  ప్రస్తుతం నిందితుడి నుండి 16.5 తులాల (192.3 గ్రాములు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.30,39,000/-. 
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తీసుకుంటున్న పటిష్ట చర్యల వల్ల దొంగతనాల కేసులలో రికవరీ శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాలను వివరించారు: 2024 సంవత్సరంలో 46% కేసుల్లో డిటెక్షన్, 60% శాతం ప్రాపర్టీ రికవరీ, 2025 సంవత్సరంలో 59% కేసులలో డిటెక్షన్, 63% ప్రాపర్టీ రికవరీ, "2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన రెండు ప్రధాన (Grave) కేసులలోనూ 100% డిటెక్షన్ మరియు 100% ఆస్తి రికవరీ సాధించడం జిల్లా పోలీసుల పనితీరుకు నిదర్శనం" అని ఎస్పీ గారు కొనియాడారు.
LHMS వినియోగం: ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు 'Locked House Monitoring System' సేవలను తప్పనిసరిగా వాడాలి. CCTV కెమెరాలు: ప్రతి వీధిలో మరియు ఇళ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరగాళ్లను త్వరగా గుర్తించవచ్చు.బ్యాంక్ లాకర్లు: ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారం ఉంచడం కంటే బ్యాంక్ లాకర్లను ఉపయోగించడం శ్రేయస్కరం.అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, ఎలమంచిలి ఇన్స్పెక్టర్ ఎస్.ధనుంజయరావు, మునగపాక ఎస్సై పి.ప్రసాదరావు మరియు వారి సిబ్బంది, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కె.అప్పలనాయుడు మరియు సిబ్బంది, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ టి.విజయ, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
Breaking News

Subscribe our Newsletter