దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో “రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు” కార్యక్రమం కింద, వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న వ్యవసాయోత్సాహం–తో–నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం 18 ఫిబ్రవరి 2026న ప్రారంభమైంది.“స్వయం ఉపాధి కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్” అనే అంశంపై జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ శిక్షణ 18 ఫిబ్రవరి 2026 నుండి 11 మార్చి 2026 వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఐఓటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రాయోగిక నైపుణ్యాలు అందించి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడమే ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమంలో టార్చ్ ఫిన్టెక్ సంస్థకు చెందిన కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ వెంకటేశ్ కొండవేటి పాల్గొని ఐఓటి ప్రాముఖ్యతను వివరించారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలని, వ్యాపారంపై అవగాహన పెంచుకొని దాని కోసం కృషి చేయాలని, ఇతరులకు ప్రేరణగా నిలిచేలా పని చేయాలని సూచించారు.సంస్థ చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వైకుంటరావు గారు విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ మరియు వరల్డ్ బ్యాంక్కు సంస్థ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఐఓటి శిక్షకులుగా శ్రీ షేక్ జహీర్ మరియు శ్రీ జకారియా శిక్షణ అందిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న డాక్టర్ కె. సుజాత గారు మాట్లాడుతూ ప్రపంచం వేగంగా డిజిటల్ వైపు దూసుకుపోతున్న ఈ కాలంలో ఐఓటి అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాకుండా మన జీవన విధానాన్ని మార్చేస్తున్న విప్లవమని తెలిపారు.స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గడియారాలు, స్మార్ట్ గృహాలు, స్మార్ట్ వ్యవసాయం, స్మార్ట్ నగరాలు — ఇవన్నీ ఐఓటి వల్ల సాధ్యమయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో సిఎస్ఇ విభాగం అధ్యాపకులు, బీటెక్ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తమ రోజువారీ జీవితంలో ఉపయోగించాలని సూచించారు.