క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ :
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని కొత్త ఎర్రవరం సమీపంలోని షణ్ముఖ గార్డెన్స్లో బుధవారం ఉదయం 9:30 గంటలకు వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కోసం శంకుస్థాపన భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపకులు ఇత్తంశెట్టి రమణ దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సోమన్నపాలెం చెందిన జనసేన పార్టీ నాయకుడు లాలం సోమినాయుడు, రేగుపాలెం చెందిన రాజన్న శ్రీను, లగుడు లోవరాజు, దుబాసి రమణ (సీనియర్ జర్నలిస్ట్), బీజేపీ నాయకుడు రాజాన సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది దంపతులు తదితరులు హాజరయ్యారు. భక్తుల సమక్షంలో వారాహి అమ్మవారి శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది.
వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం ఇత్తంశెట్టి రమణ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. అదేవిధంగా హైకోర్టు న్యాయవాది దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం రూ.50 వేల చెక్కును విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.