ప్రజా ఫిర్యాదుల వేదికలో 55 ఫిర్యాదుల స్వీకరణ

ప్రజా ఫిర్యాదుల వేదికలో 55 ఫిర్యాదుల స్వీకరణ

09/February/2026 17:49    Share:   

సత్వర పరిష్కారానికి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు   గారి ఆదేశాలు 
అనకాపల్లి, ఫిబ్రవరి 09: అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు మొత్తం 55 ఫిర్యాదులను స్వీకరించారు.
స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు: 
భూ తగాదాలు – 25,
కుటుంబ కలహాలు -- 2, మోసపూరిత వ్యవహారాలు – 4,
ఇతర విభాగాలకు చెందినవి – 24
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారు సంబంధిత అధికారులను ఆదేశిస్తూ— “ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలి. 7 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యల నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలి,” అని స్పష్టం చేశారు.
ఫిర్యాదు దారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్న అదనపు ఎస్పీ గారు—
“ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత. ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారు,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై జీ.విశ్వనాథం మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter