ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు జిల్లా శాసనసభ్యులు బడేటి
27/March/2026 07:35
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు ఈరోజు స్థానిక పవర్ పేట లోని శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు వైద్య పరీక్షలు చేయించుకున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అవసరార్థులకు ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతుగా చేయూతను అందించాలన్న లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి వైద్యులు ఈ వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.