క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్), యలమంచిలి : యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో, ఈ నెల 23న నక్కపల్లిలో జరగబోయే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూటమి పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర రోడ్లు & భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలపై చర్చించి, నాయకులకు సూచనలు చేసారు.