ఫిబ్రవరి 2 నుండి 11 వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ కోట పంచాయితీలో గల ప్రకృతి వ్యాలీ నందు పత్రీజీ మహా కరుణ ధ్యాన మహాచక్రం జరగనుంది. ఈ సందర్భంగా పది రోజులపాటు ప్రతిరోజు ఉదయం నుంచి యోగా,సామూహిక ధ్యానం, పత్రీజీ సందేశాలు, పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ల సందేశాలు, గీతా వికాసం, జ్ఞాన సభ, స్పిరుచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రత్యేకకార్యక్రమం, స్వాధ్యాయ యోగ, ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం, షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు మరియు క్యాంపైర్ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భూమాత సాక్షాత్కారం కోసం జరిగే ఈ అహింసా ధ్యాన యజ్ఞంలో పాల్గొనే ఆసక్తిగల సాధకులు 9866184445,91212 57096 నెంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని వారు కోరారు.