అనకాపల్లిలో దుకాణాలు కూల్చివేతతో పేదోడి బ్రతుకులు రోడ్డున ?

అనకాపల్లిలో దుకాణాలు కూల్చివేతతో పేదోడి బ్రతుకులు రోడ్డున ?

06/March/2026 11:19    Share:   

అనకాపల్లిలో 80 వార్డులో నూకంబిక దేవస్థానం ఎదురుగా ఉన్న దుకాణాలు జీవీఎంసీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు దీనిపై స్థానికంగా ఉన్నటువంటి 80 వార్డు కార్పొరేటర్ నీలిమ భాస్కర్ దుకాణాల ధ్వంసం పై రోడ్డుపై నిరసనకు దిగారు దీంతో 80 వార్డులో వాతావరణం ఉధృతంగా మారింది తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేసి 20 కుటుంబాలు రోడ్డులు పడేలా చేశారని జీవీఎంసీ మరియు ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు ఇదంతా కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు అంటూ పేర్కొన్నారు మాకు న్యాయం జరిగే వరకూ మేము ఇక్కడ నుంచి వెళ్ళబోయే లేదంటూ మీడియా ముఖంగా పేర్కొన్నారు ఈ దుకాణాలు కూల్చివేతతో పేదోడి బ్రతుకులు రోడ్డును పడ్డాయని న్యాయం జరిగే వరకూ ఈ నిరసన కొనసాగిస్తామని పేర్కొన్నారు
Breaking News

Subscribe our Newsletter