అన్ని రంగాల్లో జిల్లాని ప్రగతి బాటలో తీసుకెళ్లేందుకు కృషి.జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి,

అన్ని రంగాల్లో జిల్లాని ప్రగతి బాటలో తీసుకెళ్లేందుకు కృషి.జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి,

20/March/2026 06:59    Share:   

ఏలూరు, మార్చి , 19 ::-  
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా "శ్రీ పరాభవ  నామ సంవత్సర "ఉగాది" వేడుకలు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ. 
కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రాలతో హాజరైన జిల్లా అధికారులు
ఉగాది పచ్చడి సేవనం,  పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ.
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ 
శ్రీ పరాభవ  నామ సంవత్సర "ఉగాది" వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం  ఏలూరు లోని గిరిజన భవన్ లో  ఘనంగా నిర్వహించింది. .   కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ,   ఐ టి డి ఏ పిఓ రాములు నాయక్,  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అతిధులు సంప్రదాయ వస్త్రాలైన తెల్ల చొక్కా, పంచెకట్టు, కండువాలు ధరించి   హాజరై కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు. 
అనంతరం గిరిజన భవన్ లో   పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి  జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలను  ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలన్నారు.  జిల్లాలో చక్కని వర్షాలు కురిసి, రైతులకు అధిక దిగుబడులు వచ్చి సంతోషంగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నూరుశాతం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు."శ్రీ పరాభవ  నామ సంవత్సర  ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సరం అంతా ప్రజలందరికీ మంచి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో చాలామంది అధికారులు ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు.   ఉగాది వంటి పండుగలు నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవడమన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ "శ్రీ పరాభవ నామ సంవత్సర "ఉగాది" సంవత్సరం అంతా ప్రజలకు శుభాలు అందించాలని ఆకాంక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ లను వేద పండితులు  వేదఆశీర్వచనాలు అందించారు.
Breaking News

Subscribe our Newsletter