రేపు అనకాపల్లిలో ఘనంగా సామాజిక భవనం మరియు చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం

రేపు అనకాపల్లిలో ఘనంగా సామాజిక భవనం మరియు చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం

02/May/2026 18:57    Share:   

పాల్గొననున్న ఎంపీ సీఎం రమేష్ మరియు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.
అనకాపల్లి:
జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలో రేపు (ఆదివారం, మే 3వ తేదీన) అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో రెండు ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కూటమి నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
రేపు సాయంత్రం 4:00 గంటలకు శంకరం గ్రామంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ సామాజిక భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం, సాయంత్రం 5:00 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హైదరాబాద్ వెళ్లే "చర్లపల్లి ఎక్స్‌ప్రెస్" రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు మరియు అనకాపల్లి టీడీపీ ఇంచార్జ్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వీరితో పాటు కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన సామాజిక భవనం మరియు మెరుగైన రవాణా సౌకర్యం కోసం అందుబాటులోకి వస్తున్న నూతన రైలు సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు, మహిళలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.
Breaking News

Subscribe our Newsletter