అనకాపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన దాడి రత్నాకర్,

అనకాపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన దాడి రత్నాకర్,

02/May/2026 16:53    Share:   

అనకాపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం పాఠశాల తాత్కాలిక భవనం ఉడ్డు పేట ప్రభుత్వ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండి తాత్కాలికంగా ప్రారంభించిన తరగతులను తెలుగుదేశం పార్టీ  జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్ గారు పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నకర్ గారు మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారి కృషి వలన అనకాపల్లి జిల్లాకు ప్రభుత్వ కేంద్ర విద్యాలయం రావడం జరిగిందని అన్నారు. ఈ పాఠశాల యొక్క శాశ్వత భవనం అనకాపల్లి మండలం సుందరయ్యపేట వద్ద నిర్మించడం జరుగుతున్నదని అది వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మొదటి విద్యా సంవత్సరం యొక్క ఆన్లైన్ అడ్మిషన్లు, వాటి పురోగతిని ప్రధానోపాధ్యాయులను అక్కడ ఉన్న విద్యార్థులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Breaking News

Subscribe our Newsletter