పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో. చోరీ కేసు ఛేదన

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో. చోరీ కేసు ఛేదన

13/May/2026 21:27    Share:   

ముగ్గురు నిందితుల అరెస్ట్..! భారీగా బంగారం, వెండి స్వాధీనం..!!
 
క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ :
 
 పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. క్రైమ్ నెంబర్ 118/2026, U/S 305(a) BNS చట్టం కింద నమోదైన ఈ కేసులో భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
 
ఫిర్యాదుదారు నడిపల్లి వీర వెంకట శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, పెదరుషికొండలోని తన నివాసంలో మార్చి 5 రాత్రి కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు అపహరించారు. మరుసటి రోజు ఉదయం ఘటనను గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
దొంగిలించిన వస్తువుల్లో ఒక హారం, మూడు నెక్లెస్‌లు, ఒక ముత్యాల హారం, 10 జతల చెవి దిద్దులు, మూడు బంగారు ఉంగరాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను విశ్లేషించారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కదలికలను గుర్తించి కొమ్మది ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
 
అరెస్టైన నిందితులు:
 
కోలా అభిషేక్ అలియాస్ నవీన్ కుమార్ అలియాస్ సిద్దు అలియాస్ నాణీ (31)
 
జంజనం శ్రీరామ్ (25)
 
తోట దుర్గాప్రసాద్ (21)
 
 
నిందితుల వద్ద నుంచి దొంగిలించిన ఆస్తిలో కొంత భాగాన్ని కరిగించిన 107.97 గ్రాముల బంగారపు ముద్ద, 38 గ్రాముల బంగారు వస్తువులు, 350 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
ఈ కేసు దర్యాప్తు డీసీపీ (క్రైమ్) K. లతా మాదరి, ACP భవ్య ఆదేశాల మేరకు సాగగా, వి. చంద్రశేఖర్, BSS ప్రకాష్ ఆధ్వర్యంలో ఎస్ఐ సూర్యప్రకాశ్ రావు మరియు సిబ్బంది సమన్వయంతో నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు.
 
కేసును వేగంగా ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter