పట్టు వదలని విక్రమార్కులు పంచదార్ల అసైన్డ్ రైతులు.100 రోజులకు చేరిన పోరాటం ..

పట్టు వదలని విక్రమార్కులు పంచదార్ల అసైన్డ్ రైతులు.100 రోజులకు చేరిన పోరాటం ..

13/May/2026 17:21    Share:   


తప్పుడు పద్ధతుల్లో పంచదార్ల దళితుల అసైన్డ్ భూములు ప్రభుత్వం లాగేసుకుంది.. ఫిబ్రవరి 1 వ తేదీ నుండి పొలాల్లోనే నిరసన దీక్ష చేపట్టారు.. 
నిన్నటికి 100 రోజులకు చేరింది.. మూడు నెలల్లోపు RDO విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, అంతవరకు దళితుల భూముల జోలికి పోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..
పంచదార్ల దళితులకు అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ హైకోర్టు తుది ఉత్తర్వులు ద్వారా మా భూములు జోలికి రాకుండా ప్రభుత్వాన్ని నిలువరించే ఉత్తర్వులు వచ్చేదాక లేదా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తిరిగి వెనక్కి తీసుకునేదాకా నిరసన దీక్ష విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు  దళిత అసైన్ రైతు కుటుంబాలు..
వీరి పోరాట పటిమకు విదసం హ్యాట్సాప్... (హ్యాట్సాఫ్ అంటే చాలా వినమ్ర గౌరవంతో నెత్తిమీద కిరీటం లాంటి  టోపీని దించి చేత్తో ఛాతీ కింద ఉంచి శిరస్సు వంచి నమస్కరించడం అని మీకు తెలుసుగా) . విదసం నేతృత్వంలో జరుగుతున్న పోరాటం 100 రోజులకు చేరిన సందర్భంగా వారిని అభినందించడానికి జిల్లా నలుమూలల నుండి దళిత నేతలు విదసం అనకాపల్లి జిల్లా కార్యదర్శి రేవిడి కృష్ణ, YCP ఎస్సీ సెల్ నాయకులు ఇండు గుబల్లి దేవుడు బాబు, మాలల రాజ్యాధికార సమితి నేత యువ నాయకుడు లోవ చందు, డివిఎంసి మెంబర్ ఎమ్ డి రాజు, విదసం నేత సూర్య, దళిత నేత శివ, సీఐటీయూ నేత దేముడు నాయుడు, అంబేద్కరేట్ నర్సింగ రావు వచ్చి ఉత్తేజ పరిచారు.. ఈ భూముల్లో లబ్ధిదారుడు కాకపోయినా ఈ ఉద్యమాన్ని తలకెత్తుకుని బాధితులకు భరోసాగా నిలబడి టెంట్ నడిపిస్తున్న రేబాక రాము అభినందనీయుడు. సంఘనాయకులు గుడబండ అప్పారావు, అబద్దం, నాగప్పారావు , రమేష్, నాగరాజు, ఇంకా మిలిటెంటగా ఉండే అక్క చెల్లెల్లు అందరికీ విదసం తరపున మీ బూసి ఉద్యమ అభినందనలు ... పోరాడదాం .. అంతిమ ఫలితం వచ్చేదాకా ..
Breaking News

Subscribe our Newsletter