ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేసి ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలి: దేశంశెట్టి శంకరరావు..!!

ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేసి ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలి: దేశంశెట్టి శంకరరావు..!!

12/May/2026 20:18    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి :

అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం మండల ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారని అచ్చుతాపురం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు తెలిపారు. అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు.
ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని, రోడ్డు దాటడమే ప్రజలకు సవాలుగా మారిందని పేర్కొన్నారు. అచ్చుతాపురం పరిసర సుమారు 400 పరిశ్రమలు ఉండటంతో వేలాది మంది ఉద్యోగులు ప్రతిరోజూ ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
స్థానిక గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్లేవారు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy హయాంలోనే అనుమతులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన విమర్శించారు. నిర్మాణ సంస్థకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయకుండానే పనులు కొనసాగించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గ్రామాల అంతర్గత రహదారులపై ట్రాఫిక్ మళ్లించడం వల్ల ఆ రోడ్లు దెబ్బతినడమే కాకుండా గ్రామస్తులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.
అందువల్ల జిల్లా అధికారులు, సంబంధిత శాఖలు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలని దేశంశెట్టి శంకరరావు డిమాండ్ చేశారు.
Breaking News

Subscribe our Newsletter