బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

12/May/2026 19:19    Share:   

నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు, రాయలసీమ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
తీర ప్రాంతాల్లో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోంది. మే 16 నాటికి ఇవి అండమాన్ దీవులను తాకవచ్చని అంచనా.
Breaking News

Subscribe our Newsletter