రాష్ట్రంలో గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ల్లో “నో స్టాక్” పేరుతో కృత్రిమ కొరతను సృష్టిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు లేకపోవడం గమనించాలి. కేవలం మన రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్ల పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడం *వాహనదారులు మరియు ముఖ్యంగా రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నపెట్రోల్ బంక్ల వద్ద ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి, అక్కడే ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.