చెట్ల నరికివేతపై ఆందోళన – పర్యావరణ పరిరక్షణకు 50 వేల మొక్కలు నాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్..
21/April/2026 20:03
Share:
అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలంలో గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి గూగుల్ కంపెనీని స్థాపించుటకు తాత్కాలికింగా 300 ఎకరాలు భూమిని సేకరించి ఇవ్వడం జరిగింది గజిరెడ్డిపాలెం కొండవానిపాలెం గ్రామాల నుండి భూమిని సేకరించడం జరిగింది గూగుల్ కంపెనీకి లిథియం బ్యాటరీ కంపెనీ శంకుస్థాపన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది ఈ మూడు గ్రామాల్లో సేకరించినటువంటి భూమిలో కొబ్బరి జీడి మామిడి చెట్ల పెంపకం ఎన్నో సంవత్సరాలుగా సాగుతుంది ఆ చెట్ల పెంపకం వల్ల ఉష్ణోగ్రత పెరగకుండా అనకాపల్లి జిల్లాకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి గూగుల్ సంస్థ నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికి వేయడానికి సిద్ధమైంది అలా జరిగితే వాతావరణంలో వేడి పెరిగే అవకాశం ఉంది గూగుల్ సంస్థ అవసరమైన భవన నిర్మాణాలు రోడ్లు ప్రాంతాల్లోనే చెట్లు తొలగించాలి మరి ఏ ఇతర ప్రాంతాల్లోని చెట్లను తొలగించవద్దని అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు గూగుల్ సంస్థను కోరుతున్నారు గూగుల్ సమస్యకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిలో 50 వేల పంండ్ల మొక్కలను తప్పనిసరిగా రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లోని నాటవలసినటువంటి పరిస్థితి గూగుల్ సంస్థ తప్పనిసరిగా చేయాలి కొబ్బరి సాగు జీడి మామిడి సాగు వల్ల వందలాదిమంది ఉపాధి ప్రస్తుతానికి పొందుతున్నారు వారి యొక్క ఉపాధి పోతుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ఈ పండ్ల మొక్కలు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడతాయి ఒకపక్క వాతావరణ పరిరక్షణ మరోపక్క పండ్ల మొక్కల ద్వారా ఆహారం దొరుకుతుంది కాబట్టి ప్రజలకు అనకాపల్లి జిల్లాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి గూగుల్ సంస్థ 300 ఎకరాల్లో అత్యధికంగా పంటల మొక్కలను ఏర్పాటు చేయాలి