యలమంచిలి మున్సిపాలిటీలో రేపు (శనివారం) నీటి సరఫరాకు అంతరాయం

యలమంచిలి మున్సిపాలిటీలో రేపు (శనివారం) నీటి సరఫరాకు అంతరాయం

27/March/2026 22:13    Share:   

యలమంచిలి:
యలమంచిలి పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అంతరాయానికి కారణం:
సోముదేవపల్లి నుండి ఎర్రవరం సంప్‌కు నీటిని సరఫరా చేసే ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS) విభాగపు 350 ఎం.ఎం. పంపింగ్ మెయిన్ లైన్ వద్ద పురుషోత్తపురం సమీపంలో విద్యుత్ శాఖ వారు స్తంభాలు వేస్తుండగా పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీ మరమ్మత్తుల నిమిత్తం సోముదేవపల్లి వద్ద వాటర్ పంపింగ్ నిలిపివేయడం జరిగింది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
యలమంచిలి టౌన్, పాతవీధి, ఫైర్ ఆఫీస్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, నెహ్రూ నగర్, భవనం వీధి, కొత్తపేట, యనాద్రి కాలనీ, కొత్త ఎర్రవరం, ఎర్రవరం, ఏ.ఎస్.ఆర్ కాలనీ, రాంనగర్
పాక్షికంగా సరఫరా అయ్యే ప్రాంతాలు:
ధర్మవరం మరియు కోర్టు ఏరియా ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా జరుగుతుంది.
మరమ్మత్తుల దృష్ట్యా ప్రజలు సహకరించాలని, అత్యవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు
Breaking News

Subscribe our Newsletter