జనవాని కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే సుందరపు

జనవాని కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే సుందరపు

29/July/2026 19:57    Share:   

యలమంచిలి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్  ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతిపత్రాలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీలకు అతీతంగా తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు న్యాయం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చే అవకాశం జనవాణి కార్యక్రమం ద్వారా కలుగుతోందని, వచ్చిన ప్రతి వినతికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter