యలమంచిలి, జూలై 15: అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో ఒక వివాహిత తన చిన్నారితో కలిసి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పూర్వాపరాలివే..
యలమంచిలి పట్టణం, కొత్తపేట ప్రాంతానికి చెందిన శ్రీ తేటకలి ప్రభాకరరావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఫిర్యాదుదారుని కుమార్తె శ్రీమతి కొల్లాటి హారిక (29) కొంతకాలంగా తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది.
గత 13వ తేదీ రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో, ఆమె తన 2 ఏళ్ల 6 నెలల వయస్సు గల కుమార్తె మన్వితతో కలిసి ఒక గదిలో నిద్రించింది. అయితే, 14వ తేదీ తెల్లవారుజామున 03.00 గంటల సమయంలో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, హారిక తన చిన్నారితో సహా ఇంట్లో లేకపోవడాన్ని గమనించి కంగుతిన్నారు. వెంటనే బంధువులు, స్నేహితులు మరియు తెలిసిన ప్రాంతాల్లో ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు.
దర్యాప్తులో పోలీసులు
తమ కుమార్తె మరియు మనుమరాలి ఆచూకీ లేకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి ప్రభాకరరావు యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
గుర్తుపట్టిన వారు సమాచారం అందించగలరు:
అదృశ్యమైన శ్రీమతి కొల్లాటి హారిక ఆచూకీ తెలిసిన వారు లేదా ఆమెకు సంబంధించిన సమాచారం ఉన్నవారు వెంటనే యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలని, లేదా అత్యవసర నంబర్ 112కి కాల్ చేయాలని పోలీసులు కోరారు.
ఫిర్యాదుదారుని మొబైల్ నంబర్: 8555084378