విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట... ఏటికొప్పాకలో ఘనంగా స్టూడెంట్ కిట్ల పంపిణీ..!

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట... ఏటికొప్పాకలో ఘనంగా స్టూడెంట్ కిట్ల పంపిణీ..!

09/July/2026 16:21    Share:   

అనకాపల్లి జిల్లా, ( క్రైమ్ అనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక ప్రభుత్వ ఎంపీయూపీ పాఠశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్న స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు రాజన్న సూర్య చంద్ర శేషగిరి రావు (శేషు) విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్, యూనిఫాం, షూస్, సాక్స్, బెల్ట్ తదితర అవసరమైన విద్యా సామగ్రితో కూడిన స్టూడెంట్ కిట్లను అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు విద్యార్థుల్లో చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జగన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబుజి, అన్నం స్వరాజీరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, మాజీ వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, సర్పంచ్ కుమారుడు శ్రీను, కొత్వల సతీష్, నాగిరెడ్డి బాబ్జి ఎంపీటీసీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter